కింగ్ నాగార్జున 'కుబేర' ట్రైలర్.. ప్రభుత్వాన్ని రిస్క్‌లో పడేసిన బిచ్చగాడి కథ

Image 1

తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజమౌళి చేతుల మీదుగా 'కుబేర' ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ''కోట్లు కోట్లు కోట్లు అంటే ఎంత సార్'' అని ధనుష్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ''ఈ దేశంలో డబ్బు, పవర్ యే పనిచేస్తాయి.. నీతి, న్యాయం కాదు..ఇదే చరిత్ర'' అని నాగార్జున చెప్పడాన్ని బట్టి చూస్తే కథంతా డబ్బు, అధికారం చుట్టూనే తిరుగుతుందని అర్థమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి, వీధుల్లో జీవించే ఓ అతి పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణే 'కుబేర' చిత్ర ప్రధాన ఇతివృత్తం అని తెలుస్తోంది. ఇందులో స్కాములు, మనీలాండరింగ్‌, హవాలా వంటి అంశాలను ప్రస్తావించారు.

ధనుష్ ఒక బిచ్చగాడిగా నటించగా.. నాగార్జున ప్రభుత్యోద్యోగిగా కనిపించనున్నాడని టాక్. దీంట్లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా.. జిమ్ సర్బ్ కీలక పాత్ర పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

Related News